మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని ఐదవ వార్డును రానున్న రోజుల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ఆదర్శంగా నిలవనున్నట్లు కౌన్సిలర్ సుదమల్ల హరికృష్ణ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ వార్డులోని సాయికుంట రోడ్ లో ప్రభుత్వపరంగా పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు శంఖుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు. వార్డు సమగ్రాభివృద్ధికి తాను చేస్తున్న కృషికి ప్రజలు సహకరించాలని కోరారు.