హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్లో చార్మినార్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రమాదానికి గురైంది. స్టేషన్లోనే పట్టాలు తప్పింది. ఈఘటనతో హైదరాబాద్లో పలు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు చేశారు. నాంపల్లి-మేడ్చల్ మార్గంలో సర్వీసులను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాగా ఈ ఘనటలో ప్లాట్ పారం సైడ్ వాల్ను ట్రైన్ ఢీ కొట్టింది. చెన్నై నుంచి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ హైదరాబాద్ వస్తుండగా ఘటన చోటు చేసుకుంది.