స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కుటుంబాలకు సహాయం

74చూసినవారు
స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కుటుంబాలకు సహాయం
మెదక్ పట్టణంలోని గ్రోస్ స్వచ్ఛంద సంస్థ ఆదివారం 32 కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. సంస్థ సెక్రటరీ జాయి మూర్రే తల్లి కీ.శే శ్రీమతి లీలా చార్లెస్ 19వ వర్ధంతి సందర్భంగా ఇట్టి కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు. ప్రతినెలా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నట్టు జాయ్ ముర్రే తెలిపారు. ఈ కార్యక్రమంలో జోయల్ సామ్, చెర్రీ, ఫెర్రీ, మెర్రీ, టుట్టు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్