మెదక్ జిల్లా చిలప్ చేడ్ మండలం శీలంపల్లి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన మాజీ ఎంపీటీసీ నారన్నగారి లలిత కుటుంబ సభ్యులను పిసిసి ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ చార్జి ఆవుల రాజిరెడ్డి పరామర్శించారు. అనంతరం కౌడిపల్లి మండలం లింగంపల్లి గ్రామంలో గొల్ల మౌనిక అంతక్రియలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిలుముల సుహాసిని రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.