మీర్పేట మాధవి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోలీసుల చేతికి డీఎన్ఏ రిపోర్ట్ చేరింది. మాధవిని హత్య చేసిన భర్త గురుమూర్తి.. ఎలాంటి ఆధారాలు దొరకకుండా ముక్కలుగా నరికి ఎముకలను ఉడకపెట్టి, పొడిగా చేసి చేరువులో పడేశాడు. కానీ ఇంట్లో దొరికిన టిష్యూ పేపర్స్ అతన్ని పట్టించేలా చేశాయి. వాటిని డీఎన్ఏ కోసం పంపగా తల్లి, పిల్లల డీఎన్ఏతో మ్యాచ్ అయినట్టు ఫోరెన్సిక్ అధికారులు తెలిపారు.