TG: ఎక్సైజ్ అధికారుల తీరుపై మంత్రి జూపల్లి కృష్ణా రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఎక్సైజ్ శాఖపై మంత్రి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. తన దృష్టికి రాకుండా నిర్ణయాలు తీసుకున్న అధికారులపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. బేవరేజ్ కార్పొరేషన్ తప్పుడు నిర్ణయాలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. అధికారులు ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు.