ఉత్తరప్రదేశ్లోని అసెంబ్లీలో ఓ ఎమ్మెల్యే గుట్కా తిని ఉమ్మారు. స్పీకర్ సతీష్ మహానా అసెంబ్లీలోకి వెళ్తుండగా ఎంట్రీ గోడ వద్ద ఈ దృశ్యం ఆయన కంట్లో పడింది. దీంతో ఆగ్రహానికి లోనైన స్పీకర్ వెంటనే భద్రతా సిబ్బందిని ఆరా తీశారు. ఓ ఎమ్మెల్యే చేసినట్లు గుర్తించారు. ఈ పని చేసిన ఎమ్మెల్యే ఎవరో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అంగీకరించాలని ఆదేశించారు. లేకపోతే తానే బయటపెడతానని హెచ్చరించారు.