మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం సంభవించింది. లాతూర్-నాందేడ్ హైవేపై బైక్ను తప్పించబోయి ఆర్డీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులోని 36 మందికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.