టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్పై టీమ్ ఇండియాదే మెరుగైన రికార్డు. ఇప్పటివరకూ ఈ పొట్టి కప్ల్లో దాయాదితో 7 మ్యాచ్లాడగా కేవలం ఒక్కదాంట్లోనే భారత్ ఓడింది. అంతకుముందు వరుసగా అయిదు మ్యాచ్ల్లోనూ నెగ్గిన భారత్కు 2021లో పాక్ షాకిచ్చింది. కానీ 2022లో పాక్తో పోరులో కోహ్లి (53 బంతుల్లో 82 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్తో తిరిగి జట్టును గెలుపు బాట పట్టించాడు.