లోక్సభ ఎన్నికల తుది దశ పోలింగ్ ప్రచారం క్లైమాక్స్కు చేరింది. బిహార్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం ఓ ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలో 22 మందిని ప్రధాని మోదీ రాజులు, మహారాజులుగా చేశారని కానీ వారి పేర్లు మాత్రం వేరని అన్నారు. వారిలో అదానీ, అంబానీల పేర్లున్నాయని వారి కోసం నరేంద్ర మోదీ 24 గంటలు కష్టపడతారని ఎద్దేవా చేశారు.