జగిత్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెగడపల్లి మండం మద్దులపల్లిలో ఓ తల్లి ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడింది. తాను పురుగుల మందు తాగి పిల్లలకు తాగించి సూసైడ్ చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ ఘాతుకానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.