గుజరాత్ రాష్ట్రం జామ్ నగర్ జిల్లాలోని సుమ్రా గ్రామంలో పెను విషాద ఘటన చోటుచేసుకున్నది. నలుగురు పిల్లలతో కలిసి ఓ తల్లి నలుగురు పిల్లలతో కలిసి బావిలో దూకింది. తల్లి భానుబెన్ తోరియా(32) ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. చిన్నారులు రిత్విక్ (3), ఆనంది (4), అజు (8), ఆయుష్ (10) మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టంకు పంపించారు. కాగా ఈ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.