బందా జైలులో ఉన్న ఉత్తరప్రదేశ్ గ్యాంగ్ స్టర్, మాజీ ఎమ్మెల్యే ముఖ్తార్ అన్సారీ గురువారం గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. బందా జిల్లాలోని రాణి దుర్గావతి వైద్య కళాశాలలో పోస్ట్మార్టం అనంతరం అన్సారీ మృతదేహాన్ని పోలీసులు అతని స్వస్థలమైన ఘాజీపూర్కు తరలించారు. అన్సారీ అంత్యక్రియలు శనివారం ఘాజీపూర్లోని మహ్మదాబాద్ కాలీబాగ్ శ్మశానవాటికలో జరగనున్నాయి. కట్టుదిట్టమైన భద్రత మధ్య అన్సారీ అంత్యక్రియలు జరగనున్నాయి.