తెలంగాణలో సంచలనం సృష్టించిన ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి, హత్య ఘటన స్థలాన్ని మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, సీతక్క, ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే విజయ రమణారావుతో కలిసి ఆదివారం పరిశీలించారు. అనంతరం బాలిక కుటుంబాన్ని పరామర్శించారు. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి రైస్ మిల్లో ఘటన స్థలాన్ని పరిశీలించి రామగుండం సీపీ శ్రీనివాస్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.