నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణ పరిధిలోని వార్డు నెం. 8 సుభాష్ నగర్ లో పురపాలక చైర్మన్ ఎడ్మ సత్యం శనివారం పర్యటించి పలు అభివృద్ధి పనులు పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగే సమస్యలను ఒక యుద్ధ ప్రాతిపదికన అతి త్వరలో పరిష్కారం చేసేందుకు కృషి చేస్తున్నామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ గోపిరెడ్డి, లక్ష్మీ రాంరెడ్డి, మున్సిపల్ ఏఈ శివకృష్ణ, క్రాంతి మరియు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.