భువనగిరి మున్సిపల్ పరిధిలోని రాయగిరి నేషనల్ హైవే ఫ్లైఓవర్ బ్రిడ్జి పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం రెండు కార్లు ఢీకొని ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి గాయపడిన వారిని భువనగిరి ఏరియా హాస్పిటల్ కి తరలించారు. పోలీసులకు సమాచారం అందజేయడంతో సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సింది.