పాస్కల్ సూత్రంతో ప్రొటోటైపును రూపొందించిన విద్యార్థి

1573చూసినవారు
పాస్కల్ సూత్రంతో ప్రొటోటైపును రూపొందించిన విద్యార్థి
నల్గొండ జిల్లా చింతపల్లి మండలం మాల్ వెంకటేశ్వర నగర్ కు చెందిన జడ్పీ హైస్కూల్ 9వ తరగతి విద్యార్థి అజయ్ మెట్లు ఎక్కకుండానే బస్సు లోపలికి వెల్లగలిగే ఓ పరికరాన్ని డిజైన్ చేశాడు. సైన్స్ పాఠాల్లోని పాస్కల్ సూత్రాన్ని ఆధారం చేసుకొని ధర్మకోల్, సిరంజీలు, పైపులతో ప్రొటోటైప్ ను సిద్ధం చేశాడు. ఫిజిక్స్ టీచర్ శ్రీవిద్య సహకారంతో పాస్కల్ డివైజ్ ప్రోటోటైప్ ను రూపొందించాడు. ఇందులో పాస్కల్ సూత్రం ఆధారంగా హైడ్రాలిక్ పద్ధతిలో పనిచేసే ఒక ప్లాట్ ఫాం ఉంటుంది. బస్సు ఆగినప్పుడు డ్రైవర్ ఒక లీవర్ లాగితే ఆ ప్లాట్ ఫాం డోర్ దగ్గర నేలపైకి వస్తుంది. దానిపైకి ప్రయాణికులు ఎక్కాక మరో లీవర్ లాగితే ఆ ప్లాట్ ఫాం మెల్లగా పైకిలేచి బస్సు లోపలికి వెళ్లేంత ఎత్తుకు చేరుతుంది. దీంతో నేరుగా బస్సు లోపలికి వెళ్లొచ్చు. రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెస్టివల్ లో ఆకట్టుకున్న ఈ ఎగ్జిబిట్ సౌత్ ఇండియా స్థాయి సైన్స్ ఫెస్టివల్ లో ప్రదర్శనకు ఎంపికైంది. ఈ నెల 27 నుంచి 29 వరకు విజయవాడలో ఈ ప్రదర్శన జరగనుంది. వృద్ధులు, గర్భిణులు బస్సు ఎక్కే సమయంలో పడుతున్న ఇబ్బందులు చూసి వారు సులువుగా బస్సు ఎక్కేందుకు పరికరం తయారు చేయాలనే ఆలోచన వచ్చిందని అజయ్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్