శుక్రవారం దేవరకొండకు కేటిఆర్ రాక

57చూసినవారు
శుక్రవారం దేవరకొండకు కేటిఆర్ రాక
నల్గొండ జిల్లా దేవరకొండలో శుక్రవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఓటర్లతో సమావేశం నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు సాయిశివ గార్డెన్ లోనిర్వహించే ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి జగదీశ్ రెడ్డి, రవీంద్ర కుమార్, అభ్యర్థి రాకేష్ రెడ్డి తదితర నేతలు పాల్గొంటారని ప్రకటనలో పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్