నల్గొండ జిల్లా నేరేడుగొమ్ము ఎంపీపీ పదవి కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళింది. శుక్రవారం నూతన ఎంపీపీగా బిక్కు నాయక్, వైస్ ఎంపీపీగా సరోజలు అధికారుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో బీఆర్ఎస్ ఖాతాలో ఉన్న ఈ పదవులు గత మార్చిలో పెట్టిన అవిశ్వాస తీర్మానంతో తారుమారయ్యాయి. కాగా నూతన ఎంపీపీ, వైస్ ఎంపీలను ఎమ్మెల్యే బాలు నాయక్, ఇతర కాంగ్రెస్ నేతలు సన్మానించారు.