పైప్ లైన్ లీకేజీ

547చూసినవారు
పీఏ పల్లి మండలం కోదండాపురం వాటర్ ప్లాంట్ సమీపంలో జడ్చర్ల కోదాడ జాతీయ రహదారి కింద ఉన్న మిషన్ భగీరథ వాటర్ పైప్ లైన్ కు కొద్దిరోజుల కిందట భారీ లీకులు ఏర్పడి నీరు వృధాగా పోతుంది. దీంతో పలు గ్రామాలకు తాగునీరు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా పైప్ లైన్ జాతీయ రహదారి కింద ఉండడంతో వారు అనుమతితోనే రోడ్డు తవ్వాల్సి ఉండడంతో పైప్ లైన్ మరమ్మతులకు జాప్యం అవుతుందని గురువారం భగీరథ అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్