ఎన్నికల విధులకు గైర్హాజరైన సిబ్బందిపై దేవరకొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆదివారం సీఐ నరసింహులు తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా దేవరకొండ నియోజకవర్గంలో ఎన్నికల విధులకు గైర్హాజరైన 48 మంది ఎన్నికల అధికారులు, సిబ్బందిపై ఆర్డీఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు.