సత్తా చాటిన గురుకుల విద్యార్థినులు

4194చూసినవారు
సత్తా చాటిన గురుకుల విద్యార్థినులు
ఈ ఏడాది నిర్వహించిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలలో దేవరకొండ పట్టణంలోని ట్రైబల్ వెల్ఫేర్ అప్ గ్రేడ్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల విద్యార్థిని బైపీసీ ద్వితీయ సంవత్సరంలో ఎం. శిరీష 988/1000 మార్కులు, ఎంపీసీ సెకండ్ ఇయర్ పి.రాధిక 973/1000, ఎంపీసీ మొదటి సంవత్సరం మనోగ్న,465/470, బైపిసి మొదటి సంవత్సరం మహాలక్ష్మి 434/440 సాధించిందని కళాశాల ప్రిన్సిపాల్ జి ఉమా సుజాత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ద్వితీయ సంవత్సరంలో 100కు 100శాతం ఫలితాలు సాధించారని ప్రిన్సిపాల్ మంగళవారం తెలిపారు. విద్యార్థినులు అత్యుత్తమ ఫలితాలు సాధించడం కళాశాల తో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు రాష్ట్రస్థాయిలో కళాశాలకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చారని ఆమె తెలిపారు. గిరిజన విద్యార్థినిలు విద్యలో మంచి విజయాలను సాధించడం శుభసూచకమని తెలిపారు. స్థానిక శాసనసభ్యులు రామావత్ రవీంద్ర కుమార్ సైతం అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారని ఆమె తెలిపారు. మంచి విజయాలు సాధించిన విద్యార్థులను అభినందిస్తున్నట్లు అధ్యాపకు బృందం తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్