నల్గొండ జిల్లా, నాగార్జునసాగర్ నియోజకవర్గం, గుర్రంపోడు మండలం, పోచంపల్లి గ్రామంలోని శేషులేటి వాగు నుండి మాధవరావు చెరువు వరకు నాలుగు కిలోమీటర్ల వరకు ఉన్న కాలువలో పూడిక తీయడం, చెట్లను తొలగించి మంచి చెరువుగా రైతులకు ఉపయోగపడే విధంగా బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి శనివారం సొంత ఖర్చులతో పూడికలు తీయించి చెరువుని బాగు చేయిస్తున్నారు.