మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

73చూసినవారు
మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
గుర్రంపోడు మండల కేంద్రానికి చెందిన తేలుకుంట్ల జగన్, కొప్పోలు గ్రామానికి చెందిన ఐతగోని రామచంద్రం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా ఆదివారం వారి కుటుంబాలను నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ పరామర్శించారు. వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన వెంట బిఆర్ఎస్ పార్టీ నాయకులు సింగం ప్రవీణ్, మేకల వెంకట్ రెడ్డి, వేముల యాదయ్య, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్