తిరుమలగిరి మండలం రాజవరం గ్రామంలో భోగి పండుగ సందర్భంగా శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో మహిళలకు ముగ్గుల పోటీలు జై గురుదేవ్ భజన బృందం నిర్వహించడం జరిగింది. ఈ ముగ్గుల పోటీలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని మొదటి బహుమతి దాసరి చరణ్య, రెండవ బహుమతి లింగాల రాధిక, మూడవ బహుమతి యలకాని భార్గవి మహిళలందరికీ వివిధ బహుమతులు అందజేశారు. ఈ పోటీలో చిన్నారులు ఎంతో ఆసక్తికరంగా పాల్గొన్నారు.