సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే దొంగచాటుగా సంతకం పెట్టి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి నాగార్జున సాగర్ను తాకట్టు పెట్టారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మంగళవారం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగార్జున సాగర్లో పార్టీ సన్నాహాక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.