నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం నార్కట్ పల్లి మండలం చెరువుగట్టు గ్రామానికి చెందిన 200 మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శనివారం ఎమ్మెల్యే వేముల వీరేశం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి పార్టీలోని ఆహ్వానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలన్నారు.