హైదరాబాద్ శాసన మండలిలో సోమవారం జరిగిన ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం మహోత్సవంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి పాల్గొన్నారు. సిపిఐ పార్టీ నుండి ఎమ్మెల్సీగా ఎంపికైన మునుగోడు కు చెందిన నెల్లికంటి సత్యం, కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపికైన మిర్యాలగూడ కు చెందిన శంకర్ నాయక్ లకు శాసనమండలి ప్రాంగణంలో పూల బొకేలు ఇచ్చి అభినందనలు తెలియజేశారు.