భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని శాలిగౌరారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కందాల సమరం రెడ్డి, మాజీ సర్పంచ్ షేక్ ఇంతియాజ్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. సందర్భంగా మార్చి ఐదున ఉల్లాల గ్రామంలోని శ్రీ శంభు లింగేశ్వర స్వామి ఆలయంలో జరిగే నవరాత్రి ఉత్సవాలకు రావాలని ఎంపీ చామలకు ఆహ్వాన పత్రికను అందజేశారు.