చండూరులోని ప్రభుత్వ ఆస్పత్రిని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యులు, సిబ్బంది అందరూ డ్యూటీలో ఉండడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. గర్భిణీ మహిళలు, బాలింతలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఆస్పత్రిలో సిబ్బంది కొరత ఉన్నట్లుగా గుర్తించారు. డాక్టర్ ద్వారా ప్రతిపాదనలు తీసుకొని త్వరలోనే పోస్టులు భర్తీ చేస్తామన్నారు. ఆస్పత్రి కి నూతన భవనం ఏర్పాటు ప్రజా ప్రతినిధుల దృష్టిలో ఉందన్నారు.