జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ లోని బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను శనివారం రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దర్శించుకున్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు,
కాంగ్రెస్ పార్టీ నాయకులు సంపత్ కుమార్, మాజీ ఎమ్మెల్యే అబ్రహంలకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలుకుతూ ఆలయంలోకి తీసుకెళ్లారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ కమిటీ వారు శాలువా కప్పి, పూలమాలవేసి సత్కరించారు.