జులై 1 నుంచి దేశంలో కొత్త నేర చట్టాలు అమల్లోకి వస్తాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ వెల్లడించారు. జులై 1 నుంచి భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అనే మూడు చట్టాలు భారతీయ శిక్షాస్మృతి (1860), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్(1872), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (1973) స్థానంలో అమలుచేయనున్నామని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఈ చట్టాలను ప్రవేశపెట్టినట్లు తెలిపారు.