జన్నారం మండలంలోని చింతగూడ గ్రామంలో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయానికి పలు ప్రాంతాల నుండి భక్తులు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఆదివారం కావడంతో చింతగూడ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయాన్ని భక్తులు ప్రజలు సందర్శించారు అనంతరం ఆ దేవాలయంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి వారు ప్రత్యేక పూజలు చేశారు అలాగే దేవాలయం ఆవరణలో వంటలు వండుకొని వనభోజనాలు చేశారు. దీంతో దేవాలయం ఆవరణలో సందడి వాతావరణం నెలకొంది.