మొక్కులు తీర్చుకున్న భక్తులు

69చూసినవారు
కడెం మండలంలోని కొండుకూర్ లో ఉన్న పోచమ్మ అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆ గ్రామంలోని పోచమ్మ అమ్మవారి దేవాలయం మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం దేవాలయంలో ఉన్న అమ్మవారికి ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు, మహిళలు ఇళ్ల వద్ద బోనాలు వండి దేవాలయం వరకు ఊరేగింపు నిర్వహించారు. అనంతరం దేవాలయంలోని అమ్మవారికి వారు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్