జన్నారం మండల కేంద్రంలో ఉన్న పేద ముస్లిం కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముజఫర్ ఖాన్, నాయకులు నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. రంజాన్ పండుగ సందర్భంగా ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పేద ముస్లిం కుటుంబాల కోసం నిత్యవసర సరుకులను పంపించారు. ఆ సరుకులను బుధవారం రాత్రి జన్నారం మండల కేంద్రంలో పేద ముస్లిం కుటుంబాలకు వారు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రజాక్, మౌలానా, తదితరులు పాల్గొన్నారు.