అందరికీ మంచి జరుగుతుంది

53చూసినవారు
అందరికీ మంచి జరుగుతుంది
అందరికీ మంచి జరుగుతుందని జన్నారం మండల కేంద్రంలోని వేద పండితులు అన్నారు. ఉగాది పండుగను పురస్కరించుకొని జన్నారం మండల కేంద్రంలోని పలు దేవాలయాల్లో వేద పండితులు పంచాంగ శ్రవణం వినిపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాలు పుష్కలంగా పడి పంటలు బాగా పండుతాయని అన్నారు. ప్రజలు ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని వారు కోరారు. అలాగే అనుకున్న పనులు జరుగుతాయని, ప్రజలు సుఖశాంతులతో జీవిస్తారని వేద పండితులు వివరించారు.

సంబంధిత పోస్ట్