రూ. రెండు లక్షల రుణమాఫీ చేయాలని రైతుల ఆందోళన

57చూసినవారు
తమకు రూ. రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ జన్నారం మండలంలోని కవ్వాల్ గ్రామ రైతులు ఆందోళన చేశారు. మంగళవారం వారు జన్నారం పట్టణంలోని ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. తమ గ్రామంలో రూ. రెండు లక్షల రుణమాఫీ కాలేదని, దీంతో ఇబ్బందులు పడుతున్నామని వారు వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు రుణమాఫీ వెంటనే పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు, యువకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్