జన్నారం మండలంలోని తిమ్మాపూర్ మరోసారి రాజకీయ గుర్తింపు పొందింది. ఆ గ్రామానికి చెందిన ఇద్దరు ప్రముఖులు ఎంపీ బరిలో నిలవడమే దీనికి కారణం. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన వెంకటేష్ నేత గతంలో పెద్దపల్లి నుండి బి ఆర్ ఎస్ ఎంపీగా గెలుపొందారు. తాజాగా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఆత్రం సుగుణక్క కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తిమ్మాపూర్ గ్రామం పలువురు నాయకుల రాజకీయ ప్రస్థానానికి వేదికైంది.