మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు చోరీ

76చూసినవారు
బైంసాలో చైన్ స్నాచర్స్ మళ్ళీ రెచ్చిపోయారు. బుధవారం పట్టణంలో ఓ మహిళ మెడలో నుండి ఐదు తులాల బంగారు గొలుసు దొంగతనం చేసి పారిపోయారు. పట్టణంలోని రాహుల్ నగర్ వద్ద గంగాదేవి అనే వృద్ధురాలి మెడల్లోంచి గుర్తుతెలియని వ్యక్తులు గోలుసు దొంగతనం చేశారు. గత రెండు నెలల్లో ఆరు చైన్ స్నాచింగ్లు కాగా వారం రోజుల వ్యవధిలో రెండు దొంగతనాలు జరగడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్