రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పేర్కొన్నారు. గురువారం భైంసా పట్టణంలోని ఆయన నివాసంలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నరేంద్ర మోడీని మూడవ సారి ప్రధానిగా చేయడమే లక్షంగా ప్రతి కార్యకర్త పని చేయాలని కోరారు. నియోజకవర్గ నయకులు, కార్యకర్తలు ఉన్నారు.