గ్రామదేవతలకు బోనాలు సమర్పించిన భక్తులు

61చూసినవారు
లొకేశ్వరం మండలం బిలోలి గ్రామంలో వీడీసీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా బోనాలు నిర్వహించారు. పురవీధుల గుండా బాజాభజంత్రీలు, డప్పు చప్పుళ్లతో మహిళలు బోనాలు తలపై పెట్టుకుని పోచమ్మ, ముత్యాలమ్మ, మహాలక్ష్మి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సంవత్సరం సమయానికి వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని మొక్కుకున్నట్లు భక్తులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్