భైంసాలో భారీగా వాహనాలు సీజ్

62చూసినవారు
భైంసా ఓవైసి నగర్లో మంగళవారం
పోలీసులు కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. పట్టణ సిఐ రాజారెడ్డి ఆధ్వర్యంలో వేకువజామున నుండి ఇంటింటికి తిరుగుతూ తనిఖీ చేశారు. తనిఖీలలో 112 బైక్లు, 13 ఆటోలు, 1 కారు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు శాంతిభద్రతల పరిరక్షణ కోసం సహకరించాలని సూచించారు. కొత్తగా అద్దెకు వచ్చే వారి వివరాలను సేకరించాలని కోరారు. పట్టణంలో ఎవరైన అనుమానస్పదంగా సంచురిస్తుంటే పోలీసులకు సమాచారం అందివ్వాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్