ముథోల్ మండలం ముద్గల్ గ్రామ ముఖద్వారా కళాతోరణాన్ని మంగళవారం ఎమ్మెల్యే రామారావ్ పటేల్ గ్రామ పెద్దలతో కలిసి ప్రారంభించారు. అనంతరం న్యూ ముద్గల్ గ్రామంలో హనుమాన్ జయంతి వేడుకల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.