ఒక్క గేటు ద్వారా 1, 850 క్యూసెక్కుల నీటి విడుదల

77చూసినవారు
ఒక్క గేటు ద్వారా 1, 850 క్యూసెక్కుల నీటి విడుదల
సారంగాపూర్ మండలం స్వర్ణ జలాశయంలోకి ఎగువ కురుస్తున్న వర్షాలకు వరద నీరు వచ్చి చేరుతుంది. పూర్తి స్థాయి నీటి మట్టం 1183 అడుగులకు కాగా ప్రస్తుతం 1180. 5 అడుగులకు చేరుకుంది. ఎగువ నుండి ఇన్ ఫ్లో 2, 700 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరడంతో అధికారులు శుక్రవారం రాత్రి ఒక్క గేటు ద్వారా 1, 850 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసారు. స్వర్ణ వాగు పరివాహక ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్