నీట్ యూజీ పరీక్ష 2024 ఆల్ ఇండియా ఫలితాలో నిర్మల్ జిల్లా కేంద్రంలోని వెంకటపూర్ కు చెందిన సగ్గం అఖిల్ సాయి 1536 ర్యాంక్ సాధించాడు. సోమవారం నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి శాలువాతో సత్కరించి అభినందించారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన అఖిల్ సాయి నీట్ లో ఆల్ ఇండియా స్థాయిలో మంచి ర్యాంక్ సాధించడం అభినందనీయని కొనియాడారు. ఇందులో కౌన్సిలర్ పూరడి శ్రీకాంత్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ రాజారెడ్డి, తదితరులున్నారు.