పారిశుధ్య పనులపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలి: కలెక్టర్

73చూసినవారు
పారిశుధ్య పనులపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలి: కలెక్టర్
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం సందర్శించారు. ఎంపీడీఓ కార్యాలయంలో కొనసాగుతున్న ప్రజాపాలన సేవా కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలేందుకు ఎక్కువ ఆస్కారం ఉన్నందున పారిశుధ్య పనులపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అన్నారు. కలెక్టర్ వెంట సంబధిత అధికారులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్