మహిళలను ఆర్థికంగా మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మహిళాశక్తి కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా అమలు చేసి ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా లక్ష్యాన్ని సాధించేందుకు వీలుగా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. శుక్రవారం సమీకృత కార్యాలయాల అధికారులతో కలెక్టర్ సమావేశమై మహిళా శక్తి కార్యక్రమం అమలు సన్నద్ధతపై చర్చించారు.