పాఠశాలల భవనాలను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్

81చూసినవారు
పాఠశాలల భవనాలను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్
బోధన్ పట్టణంలోని పాండు ఫారం ఉర్దూ మీడియం పాఠశాల, నర్సాపూర్ ప్రభుత్వ పాఠశాల భవనాలను మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ సోమవారం పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలల భవనాల మరమ్మతి పనులను పరిశీలించడం జరిగింది అన్నారు. అక్కడ వసతులు చేపడుతున్న పనులపై ఆరా తీశారు. పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి పెండింగ్ పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. ఆయన వెంట మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.

సంబంధిత పోస్ట్