జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిజామాబాద్ నగరంలోని పోలీస్ పరేడ్ మైదానంలో విద్యార్థినులకు స్వీయ ఆత్మ రక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ మాట్లాడుతూ బాలికలు, మహిళలు శారీరకంగా, మానసికంగా దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎం. మకరంద్, చైతన్య, దుర్గాప్రసాద్, రాజేందర్ రెడ్డి, దేవిదాస్ పాల్గొన్నారు.