ప్రభుత్వ విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులు తప్పనిసరిగా ప్రభుత్వం ముద్రించిన పుస్తకాలనే చదువుతుంటారు. అయితే ప్రైవేట్ స్కూళ్లలో మాత్రం ఆయా యాజమాన్యాలు ముద్రించిన పుస్తకాలను కచ్చితంగా కొనుగోలు చేయాల్సి వస్తోంది. అయితే ఆయా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఐఐటీ కోచింగ్, స్మార్ట్ క్లాసులు, రివిజన్ టెస్టుల పేరుతో సాధారణ పాఠ్యపుస్తకాలతో పాటు ప్రైవేటు ముద్రణ సంస్థల పుస్తకాలను కొనుగోలు చేయాల్సిందిగా తల్లిదండ్రులకు సూచిస్తున్నారు.